ఒక క్యాన్సర్ బాధితునికి సత్వర వైద్య సహాయం అందక ఆర్థికంగా కష్టపడుతున్న రోగి కుటుంబానికి భరోసా కల్పిస్తూ మానవత్వానికి సజీవ నిదర్శనంగా నిలిచారు మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ విభాగం అధ్యక్షుడు మొహమ్మద్ ఖలీల్. సదరు క్యాన్సర్ పేషేంట్ వైద్య ఖర్చుల కోసం 13,800 రూపాయల ఆర్థిక సహాయం, మందులు, వైద్య పరికరాలు అందించారు.
ఈ సందర్భంగా జనాబ్ మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ “మన చుట్టూ ఉన్న వారికి సాయం చేయడం మన కనీస సామాజిక బాధ్యత అని ఇప్పుడు తాను చేసినది కేవలం తన కర్తవ్యం మాత్రమే,” అని సదరు రోగికి తమవంతుగా సహాయం చేయాలనుకునేవారు రోగి సహాయకుడు మొబైల్ నెంబర్ 8555916325 ను సంప్రదించి దాతలు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ ఉదాత్తమైన చర్యకు సమాజం నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్యాన్సర్ పేషెంట్ కుటుంబ సభ్యులు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి ఉదాహరణలు మరెంతో మందిలో స్ఫూర్తి నింపాలని ఆపన్నులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.