రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజనసభ సంఘ భవనంలో నూతనంగా నిర్మించిన సమావేశ మందిరంలో సంఘ అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. మహాజనసభలో 01-09-2023 నుండి 15-03-2024 వరకు గల ఆదాయ, వ్యయ నివేధికలు ప్రవేశపెట్టగా వాటిని సభ్యులు ఆమోదించారు. సభ్యులకు గల సందేహాలను నివృత్తి చేసి వారి నుండి విలువైన సూచనలు స్వీకరించారు. సర్వేపల్లి గ్రామంలో నిర్మించిన డీజిల్&పెట్రోల్ బంకు త్వరలో పునః ప్రారంభించబోతున్నామని ఈ సందర్భంగా చైర్మన్ తెలియజేశారు.
ఎల్లారెడ్డిపేట సహకార సంఘంనకు టేస్కాబ్ ఛైర్మెన్ కొండూరి రవీందర్ రావు సహకారంతో పెద్ద ఎత్తున దీర్ఘకాలిక రుణాలు మరియు స్వల్పకాలిక రుణాలు, మంజూరు చేశామని గుండారపు కృష్ణారెడ్డి తెలియజేశారు. భవిష్యత్తులో కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా రైతులకు సేవలందించాలనుకుంటున్నామని బంగారు ఆభరణాలపై రైతులకు రుణాలను అందించాలని అనుకుంటున్నామని సంఘాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సంఘ వైస్ చైర్మన్ జంగిటి సత్తయ్య, డైరెక్టర్లు దొమ్మాటి నర్సయ్య, గండ్ర ప్రభాకర్ రావు, గోట్టే సరిత, గోగూరి ప్రభాకర్ రెడ్డి, కస్తూరి రామచంద్రారెడ్డి, కనకట్ల సుధాకర్, కోనేటి ఎల్లయ్య, నేవూరి వెంకట నరసింహారెడ్డి, వివిధ గ్రామాల సంఘ సభ్యులు దమ్మ భూమి రెడ్డి, బ్రహ్మ చంద్రారెడ్డి, చకినాల లక్ష్మణ్, లదునూరి రామదాసు, కోల కొండయ్య, నేవూరి పద్మా రెడ్డి, గుండాడి రాంరెడ్డి, గుండారపు వెంకటరెడ్డి, తుమ్మల శ్రీనివాస్, ఒగ్గు బాలరాజు, మల్లారం రామకృష్ణారెడ్డి, శ్రీధర సత్యనారాయణ, మాదారం నారాయణ, మాదారం శ్రీనివాస్, బొమ్మనవేణి నారాయణ, మంద కిష్ట రెడ్డి, అంబురి బాబు, సంఘ సెక్రటరీ కిషోర్ కుమార్, సంఘ సిబ్బంది, వివిధ గ్రామాల సభ్యులు పాల్గొన్నారు.
