Saturday, May 17, 2025
spot_img
HomeTELANGANAకళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన సీతక్క

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన సీతక్క

ఈ రోజు వేంకటా పూర్ మండలంఎంపిడివో కార్యాలయం లో తహశీల్దార్ అధ్యక్షతన జరిగిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో ఉన్న ప్రతి పేదవాడికి రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క రూపాయి చేరాలని దళారులను నమ్మి మోసపోవద్దు పెళ్లి జరిగిన నేరుగా మీసేవ లో దరఖాస్తు చేసుకొని మండల తహశీల్దార్ కార్యాలయంలో ఇస్తే సరిపోతుందని 18 యేండ్లు దాటిన ఆడ పిల్లలకు మాత్రమే పెళ్ళిలు చేయాలని లేక పోతే చట్ట పరమైన చర్యలు ఉంటాయి కావున తల్లీ తండ్రులు ఆడ పిల్లలు భారం అనుకొకుండా బాగా చదివించి వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు తల్లీ తండ్రులు సహకరించాలి వచ్చిన ప్రతి రూపాయి సద్వినియోగం చేసుకోవాలి అని సీతక్క గారు అన్నారు
అనంతరం 70 మంది లబ్ది దారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించిన ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెన్నోజు సూర్య నారాయణ తో పాటు కాంగ్రెస్ పార్టీ పార్టీ నాయకులు కార్యకర్తలు సీతక్క వెంట ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments