వాంకిడి మండలంలో చించోలి గ్రామంలో శాలివాహన సిమెంట్ కంపెనీ పేరుతో రైతుల దగ్గర వందల ఎకరాలు భూములను తీసుకొని నేటికీ 10 సంవత్సారాలు గడుస్తున్న కూడా ఆ భూములలో కంపెనీ పెట్టలేదు దీని వలన భూములు కోల్పోయిన రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయి పైగా కంపెనీ యాజమాన్యం ఆ భూములను రైతులకు సాగు చేయకుండా కౌలుకు ఇస్తు రైతుల నోట్లో మట్టి కొడుతుంది, కావున కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఉండి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఈ విషయం పై జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కని రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం. అంతే కాకుండా కొందరు కంపెనీ యాజమాన్యానికి తొత్తులుగా ఉంటు రైతులకు ఆన్యాయం చేస్తున్నారు వారి పై చర్యలు తీసుకోవాలని త్వరలో రైతులతో కలిసి మంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్