కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం శ్రీ ప్రతిభ విద్యాలయలో ప్రపంచ ఆంగ్ల భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ ప్రతిభ విద్యాలయ అధినేత దాసం శేషారావు ప్రపంచ ఆంగ్లభాష దినోత్సవ వేడుకలకు ముందుగా రిబ్బన్ కట్ చేసి, ఇంగ్లాండ్ జాతీయ కవి, బార్డ్ ఆఫ్ అవాన్(కవీశ్వరుడు), నాటక రచయిత, నటుడు విలియం షేక్స్పియర్ చిత్రపటానికి పూలమాలవేసి, గౌరవించి, పూజించారు. ఈ సందర్బంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మాట్లాడే అత్యంత ప్రజాదరణ పొందిన భాషల్లో ఆంగ్ల భాష ఒకటి అని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 952 మిలియన్లు మంది ప్రజలు ఆంగ్లాన్ని వారి మొదటి భాషగా మరియు 603 మిలియన్లు మంది రెండో భాషగా మాట్లాడుతున్నారని తెలియజేశారు. తదుపరి విద్యార్థిని విద్యార్థులు స్టోరీ టెల్లింగ్, పిక్చర్ రీడింగ్, టంగ్ ట్విస్టర్స్, ప్రొవెర్బ్స్, ఇంగ్లీష్ సాంగ్స్, జోక్స్, స్కిట్స్, రైమ్స్ మరియు పోయెమ్స్ మొదలగు వాటిని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, లీడ్ అకాడమిక్ కోఆర్డినేటర్ ఎం.రాణి, ప్రీ ప్రైమరీ ఇంచార్జ్ సుజాత, ఈవెంట్ కోఆర్డినేటర్లు బి.రాణి, నూకరాజు, శ్రీనివాస్, జెవి స్వామి, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
