లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలో లయన్ కోట సతీష్ కుమార్ తన తాతగారైన కోట మల్లయ్య జ్ఞాపకార్థం గొల్లపల్లి బస్టాండ్ లో ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రంలో మొదటి రోజు అందరికీ మజ్జిగ పంపిణీ చేశారు. తీవ్రమైన ఎండలతో దాహార్తితో అల్లాడిపోతున్న జనాలకు ఈరోజు ఏర్పాటు చేసిన చలివేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట ప్రెసిడెంట్ పయ్యావుల రామచంద్రం కోట సతీష్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట ద్వారా చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలకుకృతజ్ఞతలు తెలిపారు. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పయ్యావుల రామచంద్రం, సెక్రటరీ నాయిని భాస్కర్ రెడ్డి, మల్లారెడ్డి, డిస్టిక్ క్యాబినెట్ మెంబర్స్ ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, నంది కిషన్, ఇతర లయన్స్ క్లబ్ బాధ్యులు పెంజర్ల రవి, పార్టీ దేవయ్య, ముత్యాల కృష్ణారెడ్డి, చేపూరి రాజేశం, తదితరులు పాల్గొన్నారు.
