సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. శుక్రవారం స్థానికుల వివరాలు ప్రకారం అనంతనగర్ చెందిన మహిళను ఆమె ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో నిందితుల ఆధార్ కార్డులు మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమాని నుంచి వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.