ఎల్లారెడ్డి పేట కు చెందిన పంజా యశ్వంత్ నేడు వెలువడిన పదవ తరగతి పరీక్షల్లో 10/10 కి 9.8 మార్కులు సాధించారు. తెలంగాణ రిపోర్టర్ పంజా సంపత్ కుమార్ కుమారుడు కరీంనగర్ లోని ఆల్ఫోర్స్ హై స్కూల్ లో చదివి 9.8 మార్కులు సాధించారు. భవిష్యత్ లో మంచి కార్డియాలజీస్ట్ కావాలనుకుంటున్నాను అని అన్నారు. తన తల్లి భాగ్యలక్ష్మి బోయినపల్లి మండలంలోని కోదురుపాకలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు గా పనిచేస్తోంది. తన తల్లినీ స్ఫూర్తిగా తీసుకుని వైద్య వృత్తి చేయాలని ఆశగా ఉందని యశ్వంత్ అన్నారు. 9.8 మార్కులు సాధించిన పంజా యశ్వంత్ కుమార్ ను స్థానిక తాజా మాజీ ఉపసర్పంచ్ దంపతులు ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ లు అభినందించారు.