రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ కరికే వనిత, కూతురు తేజస్విని, కుమారుడు తేజ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ వద్ద నారాయణపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు గౌస్ రెండో కుమారుడు ఇర్ఫాన్ తార్ జీప్ తో ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తేజస్వినికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, ఈ ప్రమాదాన్ని వార్త పెడితే వార్త ఎలా పెడతారో మేము చూస్తాం అంటూ చరవాణిలో ఓ జర్నలిస్టుకు కాంగ్రెస్ నాయకుడు గౌస్ బెదిరింపులకు దిగాడు, ఎలా రాసుకుంటావో రాసుకో మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు,


