రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల పలు వార్డులలో మిషన్ భగీరథ నీరు అపరిశుభ్రంగా వస్తుందని పలువురు మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ కు చరవాణి ద్వారా ఫిర్యాదు చేశారు. పిర్యాదు పై స్పందించిన ఆయన పలువురి ఇండ్లలోకి సరఫరా అవుతున్న నీటినీ పరిశీలించగా నీరు అపరిశుభ్రంగా వస్తుందని ఫిల్టర్ చేసిన తర్వాత వదలాలని మిషన్ భగీరథ అధికారులతో పోన్ లో మాట్లాడారు. గతంలో మాదిరిగా సరిపోయే విధంగా మిషన్ భగీరథ నీరు రావడం లేదనీ పలు వార్డుల ప్రజలు చెప్పగా సరిపోయే విధంగా మిషన్ భగీరథ నీటినీ వదలాలని అధికారులకు విన్నవించారు.

