మహేశ్బాబు – త్రివిక్రమ్ కాంబో నుంచి వచ్చిన ‘అతడు’ అంత తేలిగ్గా మర్చిపోయే సినిమా కాదు. ‘ఖలేజా’ బాక్సాఫీసు దగ్గర ప్రభావం చూపించలేకపోయినా, మహేశ్ అభిమానులకు ఆ సినిమా బాగా నచ్చేసింది. ఇప్పుడు వీరిద్దరి కలయికలో ముచ్చటగా మూడో చిత్రం వస్తోంది. పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలు. ఇటీవల హైదరాబాద్లో కొన్ని సన్నివేశాలతో పాటు ఓ పోరాట ఘట్టాన్ని తెరకెక్కించారు. ఈనెలాఖరున మరో కీలకమైన షెడ్యూల్ మొదలు కానుంది. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్ తీర్చిదిద్దారు. అందులోనే దాదాపు నెల రోజుల పాటు కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. ఏప్రిల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించినప్పటికీ, ఈ సినిమా వేసవిలో రావడం కుదరదు. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంగీతం: తమన్.