రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకి చెందిన వంగ గిరిధర్ రెడ్డి కి హైదరాబాదులో ఆదివారం తెలుగు వెలుగు సాహితీ వేదిక వారు త్యాగరాయగానసభలో జాతీయ అవార్డు మహానంది పురస్కారాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రహాసన్, తెలంగాణ సమాచార శాఖ సంయుక్త సంచాలకులు వెంకటరమణ, దైవజ్ఞ శర్మ చేతుల మీదుగా అందజేశారు. వంగ గిరిధర్ రెడ్డి గత కొన్నేళ్లుగా రక్తదానం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచాడు. 44సార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో, షిరిడీలో రెండుసార్లు, ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రెండుసార్లు తాను రక్తదానం చేయగా గతంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకు హెల్త్ కార్డును, మెమొంటోను అందుకున్నారు. అవార్డు వేడుకలో తెలుగు వెలుగు సాహితీ వేదిక చైర్మన్ పోలోజు రాజకుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి, రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి పూర్ణచంద్రాచార్యులు, జాతీయ కన్వీనర్ వలబోజు మోహన్ రావు, జాతీయ అధ్యక్షులు రంగిశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత కు పలువురు అభినందనలు తెలిపారు.
