రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బిజెపి నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. సోమవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వాడవాడలా బిజెపి ప్రచారం విస్తృతంగా చేస్తూ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కి ఓటు వేసి ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయాలని ఓట్లను అభ్యర్థిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు