ఖానాపూర్ : అలేఖ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఖానాపూర్ మండలంలోని అంబేద్కర్ నగర్ కాలనికి స్టానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో కలసి వెళ్లారు. అలేఖ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.ముందుగా అలేఖ్య చిత్రపటానికి పూలమాలలు వేసే శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ… ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. నిందితులకు కఠినంగా శిక్షపడే విదంగా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.