కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని మండల విద్యా వనరుల కేంద్రం కార్యాలయంలో MEO విధులకు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియడం లేదని MEO సమయపాలన పాటించడం లేదని మండల ప్రజలు ఆరోపించారు. బుధవారం పనుల నిమిత్తం వచ్చిన మండల ప్రజలకు మధ్యాహ్నం పన్నెండు గంటలైన అధికారి ఖాళీ కుర్చీ దర్శనం ఇవ్వడంతో సార్ ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని ధోరణి చోటు చేసుకుంటోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.