జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద వంట చేస్తున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి జిల్లా అధికారుల సూచన మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్, ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులకు సిలిండర్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు, విద్యార్థులు, మధ్యాహ్నం భోజనం వేళలో ఇబ్బందులకు గురవుతున్నారని గ్రహించి వారికి గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు…

