ఈరోజు హైదరాబాద్ లోని తన నివాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ ముక్త కంఠంతో అందరూ ఈ దాడిని ఖండిస్తూ చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబాలకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఈ శుక్రవారం ప్రార్థించాలన్నారు. జమ్మూ కాశ్మీర్ పహాల్గామ్ లోని పర్యటకుల బృందాన్ని లక్ష్యంగా చేసుకొని వారిపై జరిగిన భయంకరమైన ఉగ్రదాడిని కండిస్తున్నాం అని ఇది అమానవీయ చర్య అని విచారం వ్యక్తం చేస్తూ ఉగ్రవాద దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని బహిరంగంగా కఠినాతి కఠినంగా శిక్షించాలని కలలో కూడా ఇలాంటి చర్యలు పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా శిక్ష అమలు చేయాలన్నారు.
కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని భారతదేశాన్ని మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని కుదిపేసిందని ఈ దాడిలో చాలా మంది పర్యాటకులు చనిపోయారని అనేక మంది తీవ్రంగా గాయపడ్డారని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రవాదానికి మతం ఉండదని చిన్న చీమకు కూడా హాని తలపెట్ట వద్దని ఇస్లాం చెప్తుందని ప్రభుత్వం ఉగ్రవాదంపై తీసుకునే ఎలాంటి చర్య అయినా సరే మా మద్దతు ఉంటుందని మానవత్వం ఉన్నవారు ఎవరైనా సరే ఈ హేయమైన చర్యను ఖండించాల్సిందే అన్నారు