రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గల శ్రీ మార్కండేయ ఆలయాన్ని కేకే మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు. మార్కండేయ జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా శనివారం ఆలయానికి కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, మండలబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, వంగ గిరిధర్ రెడ్డి, బుచ్చ గౌడ్, నంది కిషన్, బండారి బాల్ రెడ్డి, గంట వెంకటేష్, చెన్ని బాబు, పందిర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు


