రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన సిరిపురం మల్లయ్య (65) గడ్డి మందు సేవించి నిన్న అర్ధరాత్రి చికిత్స పొందుతూ మరణించాడు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన సిరిపురం మల్లయ్య తన పొలం వద్ద గడ్డి మందు సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్ళగా సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ మల్లయ్య ప్రాణాలు దక్కలేదు. మృతునికి భార్యా పిల్లలు ఉన్నారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.