Tuesday, January 21, 2025
spot_img
HomeTELANGANAడే కేర్ సెంటర్ నుండి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఆశ్రమం వృద్దులు

డే కేర్ సెంటర్ నుండి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఆశ్రమం వృద్దులు

ప్రభుత్వం మరియు సహాయ వెల్ఫేర్ అసోసియేషన్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ వయో వృద్ధుల ఆశ్రమం ఎల్లారెడ్డిపేట, మండేపల్లిలోని డే కేర్ సెంటర్ మరియు వృద్ధుల ఆశ్రమంలోనీ వృద్ధులు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు, జిల్లా సంక్షేమ అధికారి పి. లక్ష్మి రాజం, సహకారంతో కొండగట్టులోని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వనభోజనాలు చేశారు, ఈ సందర్భంగా వృద్దులు అందరూ సంతోషం వ్యక్తపరిచారు. జిల్లా కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వృద్ధుల ఆశ్రమం కో ఆర్డినేటర్ ఎం.మమత, అసిస్టెంట్ కోఆర్డినేటర్ వెంకటేష్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments