Sunday, March 23, 2025
spot_img
HomeTELANGANAధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై శిక్షణ

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై శిక్షణ

యాసంగి- 2023-24 సీజన్ కి సంబందించి వరిధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో APMలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జీలు, బుక్ కీపర్లు, కమిటీ సభ్యులకు శనివారం శిక్షణ ఇచ్చారు. DRDO కార్యాలయానికి కేటాయించిన వరిధాన్యం (44) కొనుగోలు కేంద్రాల నిర్వహణ పై DRDO శేషాద్రి మాట్లాడారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, ప్యాడీ క్లీనర్ ద్వారా పట్టిన ధాన్యాన్ని సంబందిత AEO సర్టిఫై చేసిన ధాన్యమును మాత్రమే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. అలాట్ చేసిన మిల్లులకు మాత్రమే ధాన్యాన్ని పంపించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రములో ఎటువంటి సమస్యలు రాకుండా, సజావుగా సాగేలా చూసుకోవాలని, షిప్ట్ చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు (OPMS) లో సవరించిన విధానం ఆధారంగా కొత్తగా ప్రవేశ పెట్టినటువంటి EYERIS రైతు వారీగా నమోదు చేయాలని, తాగునీరు, నీడ సౌకర్యం ఉండేలా చూడాలని వివరించారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల డీఎం జితేంద్ర ప్రసాద్, అదనపు DRDO జీ శ్రీనివాస్, DPM పాపారావు, జిల్లా సమాఖ్య అధ్యక్షులు సరిత, జిల్లా సమాఖ్య కార్యదర్శి రజిత, సివిల్ సప్లై కార్యాలయం సిబ్బంది నాగాచారి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments