జమ్మికుంట పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ జోన్ కమిటీ సభ్యులు రాము మాట్లాడుతూ ఆనాటి బ్రిటిష్ పాలనలో చిన్నచిన్న వ్యాపారలతో మొదలై ఎగుమతులు. దిగుమతులతో దేశ సంపదను దోచుకుపోయారు అన్నారు. అదేవిధంగా ఈనాడు మార్వాడిస్, చాయ్, సమోసా, జిలేబితో, చిన్న చిన్న వ్యాపారాలతో మొదలై, నేడు దేశాన్ని శాసించే స్థాయికి ఎదుగుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక వర్తక, వాణిజ్య, వ్యాపారులపై, నిరుద్యోగులపై వేటు. ఏ పట్టణానికి పోయిన ఏ పల్లెటూరుకుపోయిన గాని మార్వాడి వ్యాపారంలు మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నాయి అని అన్నారు. ఈరోజున ప్రతి వ్యాపారంలో మార్వాడి ముందుంటున్నారు. వినాయక, విగ్రహాలతో మొదలు పెడితే హనుమాన్, దుర్గామాత, విగ్రహాల ఊరేగింపులతో, నేడు చాయ్ అమ్ముడు తో నుండి మొదలుకొని బడా షాపింగ్ మాల్స్, సెకండ్ క్వాలిటీతో కిరాణం షాపులు, టెక్స్టైల్స్ బట్టల షాపులు, ప్లైవుడ్ షాపులు, ఎలక్ట్రికల్ షాపులు, సూపర్ మార్కెట్లు, మొబైల్ షాప్, బంగారం షాపులు, ఐరన్& హార్డ్వేర్, పెయింటింగ్& సానిటరీ స్టోర్స్, టైల్స్ సెంటర్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్, ఎలక్ట్రానిక్స్, స్వీట్ హౌస్ లు, ఫ్రూట్ షాపులు, జ్యూస్ సెంటర్లు, గప్చుప్ బండ్లు, టిఫిన్ సెంటర్స్, హోటల్స్, ఏజెన్సీలు, బుక్ స్టాల్స్, బ్యాంగిల్ సెంటర్స్, కవర్ స్టోర్స్, రాష్ట్రంలో ఏ జిల్లాకు పోయినా ఏ మండల కేంద్రానికి పోయినా గాని వీధి వీధికి గల్లి గల్లి కి మార్వాడి దుకాణాలు ఉన్నాయి అని అన్నారు. ఈ యొక్క మార్వాడీ వ్యాపారులు అందరూ సిండికేట్ గా మారి సెకండ్ క్వాలిటీ వస్తువులతో అధిక ధరలకు అమ్ముతు స్థానిక అమాయక ప్రజలను మరియు చిన్న చిన్న వ్యాపారుల రక్తం త్రాగుతున్నారని వీరి వల్ల స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతకి ఉపాధి దొరకక బ్రతకడానికి కష్టంగా ఉందని వెంటనే వీరి షాప్ లపై లేబర్ ఆఫీసర్, మరియు ఫుడ్ ఇన్స్పెక్టర్, ఉన్నత అధికారులు తనిఖీలు చేసి స్థానిక నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులను, కలుపుకొని ఆందోళన, పోరాటాలు, నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.