Saturday, November 15, 2025
spot_img
HomeTELANGANAసందడి చేస్తున్న ఆరుద్ర పురుగులు... రైతుల కండ్లలో ఆనందం

సందడి చేస్తున్న ఆరుద్ర పురుగులు… రైతుల కండ్లలో ఆనందం

తొలకరి చినుకు ఆరుద్ర మెరుపు ఆరుద్ర కార్తె పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేవి ఆరుద్ర పురుగులే. వాతావరణం చల్లబడి, తొలకరి జల్లులు కురువగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి. వర్షాలు కురుస్తుండడంతో ఈ మృగశిర లేదా ఆరుద్ర కార్తె లోనే ఆరుద్ర పురుగులు నేలపై తిరుగుతూ సందడి చేస్తుంటాయి. రైతులకు ఆనందం కలిగిస్తుంటాయి. అన్నదాతలకు మేలు చేసే పర్యావరణ నేస్తాలు ఇవి. ఇప్పటి తరానికి ఇవేవో తెలియదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పెద్దవారికి, 30 ఏళ్లు పైబడిన వారందరికీ ఆ పురుగులు ఏమిటో, అవి తీసుకొచ్చే సమాచారం ఏమిని స్పష్టంగా తెలుసు. ఇవి రైతులు దుక్కులు దున్నాక పొలాల్లో సందడి చేస్తాయి. ఏ రైతూ వీటిని చంపడు ఎవ్వరినీ చంపనీయడు దేవతలకు, వరుణ దేవుడికి ప్రతిరూపంగా వీటిని భావిస్తారు కొలుస్తారు. అలాంటి ఆరుద్ర పురుగులు వర్షాలు కురిసి కాలమవుతుందనుకుంటేనే మనుషులకు కనిపిస్తాయి. ఈ పురుగులు గ్రామాల్లో కనిపించాయంటే రైతులు మద్దుల చంద్రారెడ్డి, సాదు మల్లారెడ్డి, మద్దుల లింగారెడ్డి, గూడ సిద్ధి రెడ్డి, మంతెన చంద్రారెడ్డి, రావుల లింగారెడ్డి, సత్తి లక్ష్మారెడ్డి, బంగ్లా బాల్రెడ్డి, బంధారపు బాల్రెడ్డి, సాదు వెంకట్ రెడ్డి, మద్దుల పద్మా రెడ్డి, పారి పెళ్లి సంజీవరెడ్డి, పారి పెల్లి రాంరెడ్డి, బందారపు బాల్ రెడ్డి లు అనందం వ్యక్తం చేశారు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments