రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపెల్లి మండలం పద్మనగర్ గ్రామానికి చెందిన నాగిశెట్టి ప్రసాద్ పద్మనగర్ లొ శనివారం ఉదయం వాకింగ్ వెళ్లి తిరిగి ఇంటీకి వస్తున్న క్రమంలో వెనుక నుండి కారు డికోట్టడంతో నాగిశెట్టి ప్రసాద్ అనే యువకుడు క్రింద పడి స్పృహ కోల్పోవడంతో సమీపంలో ఉన్న సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పిటల్ తరలించే క్రమంలో మరణించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రసాద్ మరణ వార్తతో వారి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నయి. మరణానికి ముందు స్నేహితులతో మాట్లాడుతూన్న సెల్ఫీ వీడియోని చూస్తూ స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపించారు

