రాజన్నసిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ హై స్కూల్ విద్యార్థినిలు ఏప్రిల్ 27 మరియు 28 తేదీలలో రంగారెడ్డి జిల్లా కర్తల్ మండల్ చరికొండ గ్రామంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి పాఠశాలల ఆహ్వానిత వాలీబాల్ పోటీలలో మూడవ స్థానం సాధించిన జడ్. పి .హెచ్.ఎస్ రాచర్ల బొప్పాపూర్ బాలికల జట్టును ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్, ఎస్సై రమాకాంత్ అభినందించారు. వారు మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం శారీర దారుఢ్యం కలుగుతాయని, క్రీడా కోటలో వివిధ రంగాలలో ఉద్యోగాలు సాధించవచ్చని తెలియజేశారు. దీనిలో భాగంగానే పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వివిధ క్యాంపులు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు.