తెలంగాణ రాష్ట్రంలోఏర్పాటు చేసిన 16 కార్పొరేషన్లతో పాటు నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆల్ బీసీ మైనారిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అంకూస్ శనివారం జమ్మికుంటలో జరిగిన విలేకరుల సమావేశం లో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా మహమ్మద్ అంకుస్ మాట్లాడుతూ గతంలో ఇచ్చిన దూదేకుల ఫెడరేషన్ జీవో ఎంఎస్ నెంబర్ 125 ద్వారా ఫెడరేషన్ను ఇంప్లిమెంట్ చేయలేదన్నారు. ముస్లిం జనాభాలో అంతర్భాగమైన దూదేకుల జనాభా దాదాపు 70 శాతం ఉంటుందని, మా కులం సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబాటుతో వివిధ చేతి వృత్తి పనులు చేసుకుంటూ జీవన ఉపాధి పొందుతున్నామని మా కులం మనుగడ పొందాలంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు తగిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించినట్లయితే మా కులంలో ఉన్న నిరుపేదలు కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం పొంది వారి జీవితాలు బాగుపడుట కొరకు ఎంతో చేయూతనిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని వేడుకుంటున్నామని మా కులాన్ని పరిగణలోకి తీసుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేసి న్యాయం చేయగలరని డిమాండ్ చేసారు