ఎల్లారెడ్డిపేటలో ఘనంగా గుడ్ ఫ్రైడే దినోత్సవం నిర్వహించారు పాస్టర్స్ ఫెలోషిప్ అద్యక్షులు పాస్టర్ రాజేష్ క్రీస్తు యేసు ప్రేమ స్వరూపి అని సర్వపాపాల విముక్తి కోసం ఆయన శిలువలో మరణించి తిరిగి పునరుద్దానుడైయ్యారని ఎల్లారెడ్డిపేట సర్కిల్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ రాజేష్ అన్నారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏసుక్రీస్తు సిలువ సన్నివేశాలను ప్రదర్శిస్తూ క్రైస్తవులు ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా యేసు క్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్ధనా మందిరాలలో పాస్టర్లు వాటి అర్థాలను ప్రజలకు వివరించారు. అదేవిధంగా పట్టణంలోని పలు ప్రార్ధన మందిరాలలో పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు వాక్యపదేశం చేశారు. గుడ్ ఫ్రైడ్ పండుగ సందర్బంగా వెంకటాపురంలో ఫాస్టర్ రాజేష్ , అల్మాస్పూర్ లో ఫాస్టర్ కూలేరి కిషోర్, ఎల్లారెడ్డిపేటలో ఫాస్టర్ ఆభ్రహాం, ఫాస్టర్ కూలేరీ దిప్తీ, ఫాస్టర్ మధు, పాస్టర్ రత్నాకర్ పాస్టర్ ప్రేమ్ కుమార్ పాస్టర్ క్రీస్తు దాసు, పాస్టర్ నతన్యల్ ఆయా ప్రార్థన మందిరాల్లో పాస్టర్లు బోధనలు చేశారు, క్రైస్తవులు అధిక సంఖ్యలో హాజరైనారు