Sunday, October 5, 2025
spot_img
HomeTELANGANAజయ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

జయ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి గ్రామంలో గల జయ ఆసుపత్రిలో ఆదివారం సిరిసిల్లకు చెందిన డాక్టర్ మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో చెవి, ముక్కు, గొంతు సమస్యలపై ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ ఏ మోహన్ కృష్ణ, ఎంఎస్, ఈఎన్టి వివిధ సమస్యలతో వచ్చిన రోగులకు ఉచిత పరీక్షలు నిర్వహించారు. చెవి సమస్యలతో వచ్చిన వారికి ఉచితంగా వినికిడి పరీక్షలు చేసి వైద్య సేవలు అందించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 41 మంది వైద్య సేవలు పొందారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ బాబు, డాక్టర్ జయశ్రీ, డాక్టర్ దినేష్, లయన్ అనంతుల శివప్రసాద్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments