రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామ పంచాయతీ హామ్లెట్ గ్రామమైన ఎర్రనర్సు పల్లెలో కంకటి స్వామి (45) అనే వ్యక్తి సోమవారం రోజు రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇల్లంతకుంట ఎస్సై ఎల్ రాజు గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మృతునికి 23 లక్షల అప్పు ఉందని ఎస్ఐ తెలిపారు. అప్పు తీర్చడానికి పొలం అమ్ముదామంటే మృతుని తమ్ముడు కంకటి ప్రభాకర్ అడ్డుపడి భూమి అమ్మనీయకుండా అభ్యంతరం తెలిపాడని పేర్కొన్నరు. అంతేకాకుండా మృతుడు స్వామి ఇల్లు అమ్మి అప్పు కడదాం అనుకుంటే ప్రభాకర్ ఇల్లు కూడా తన పేర రిజిస్టర్ చేసుకొని హౌసింగ్ లోన్ తీసుకున్నాడని తెలిపారు. ఈ విషయంపై సోమవారం రోజున గ్రామంలో జరిగిన కుల సంఘ సభ్యుల ముందు పెట్టగా పొలం నాదే, ఇల్లు పై తీసుకున్న అప్పు కూడా కట్టను ఏం చేసుకుంటావో చేసుకో అని కంకటి స్వామిని కంకటి ప్రభాకర్ బెదిరించగా, మనస్థాపానికి గురైన స్వామి సోమవారం రాత్రి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని ఎస్ఐ పేర్కొన్నారు. ఈ స్థితిలో ఉన్న తన భర్తను నాగమణి అంబులెన్స్ లో సిరిసిల్ల ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపినట్టు ఎస్సై పేర్కొన్నారు. మృతుని భార్య కంకటి నాగమణి ఫిర్యాదు చేశారని, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.