Saturday, May 17, 2025
spot_img
HomeTELANGANAఇజ్రాయిల్ వస్తువులను బహిష్కరించండి: SIO వరంగల్ అధ్యక్షుడు ఫహిముద్దీన్

ఇజ్రాయిల్ వస్తువులను బహిష్కరించండి: SIO వరంగల్ అధ్యక్షుడు ఫహిముద్దీన్

పాలస్తీనా దేశంపై ఇజ్రాయిల్ జరుపుతున్న క్రూర, అమానవీయ దాడులకు నిరసనగా మార్కెట్ లో వాడకంలో ఉన్న ఇజ్రాయిల్ వస్తువులను ప్రతి ఒక్కరూ బహిష్కరించాలని SIO వరంగల్ అధ్యక్షుడు ఫహిముద్దీన్ పిలుపునిచ్చారు. ఇజ్రాయిల్ కి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకతను చాటాలని పాలస్తీనీయులకు మద్దతుగా నిలబడాలని కోరారు. వరంగల్ సీటీ స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గవైజేషన్ శుక్రవారం ప్రార్థనల అనంతరం ప్లకార్డులతో వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో నిరసన కార్యక్రమం చేపట్టిందని SIO వరంగల్ అధ్యక్షుడు ఫహీముద్దీన్ తెలిపారు. తలదాచుకోవడానికి శరణం ఇచ్చిన పాలస్తీనా ప్రజలపైనే ఇజ్రాయిల్ దాడులు చేయడం వారి క్రూరత్వాన్ని నిరూపిస్తుందని ఎందరో పాలస్తీనా వృద్దులు, చిన్నపిల్లలు, మహిళలు ఈ దాడుల వల్ల రోజూ మరణిస్తున్నారని ఇంత కర్కశంగా ఇజ్రాయిల్ ప్రవర్తిస్తున్నా ఏ ఒక్క దేశం నోరు మెదపకపొవడం మానవత్వంపైనే మచ్చ అని ఆవేదన చెందారు. కనీస మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరూ ఇజ్రాయిల్ కి వ్యతిరేకంగా పాలస్తీనా దేశవాసులకు మద్దతుగా తమ గళం విప్పాలని, తగు సహాయం చేయాలని కోరారు. గత భారత ప్రభుత్వాలు పాలస్తీనా దేశానికి మద్దతు ఇచ్చిన విధంగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా బహిరంగాంగా అన్ని విధాల మద్దతు ఇవ్వాలని ఇజ్రాయిల్ కి వ్యతిరేకంగా మాట్లాడాలని మన దేశ ఔన్నత్యాన్ని చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో SIO వరంగల్ కార్యదర్శులు హంజా, అబ్దుల్లాహ్, ముబీన్, అఫ్రోజ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments