రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎన్నారై మండల అధ్యక్షులు మరియు కాంగ్రెస్ నాయకులు అయినటువంటి మహమ్మద్ లాలా ప్రస్తుతం సౌదీలో ఉంటూ 20 నిరుపేద కుటుంబాలకు రంజాన్ కానుకగా నిత్యవసర సరుకులు తన మిత్రుడు అయినటువంటి బెస్త నరేష్, పెరియర్ రామస్వామి ద్వారా అందించారు. రంజాన్ పండగ సందర్భంగా నిరుపేద కుటుంబాలు కూడా రంజాన్ వేడుకను ఘనంగా జరుపుకోవాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టరు. మహమ్మద్ లాలా కరోనా సమయంలో కూడా అనేక మంది నిరుపేద కుటుంబాలను ఆదుకోవడమే కాకుండా పేద ప్రజలకు తనకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇదేవిధంగా మహమ్మద్ లాలా ప్రతి సంవత్సరము నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని లాలా బాయ్ ఉన్నత స్థాయికి ఎదగాలని, తన యొక్క కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని నిరుపేద కుటుంబాలు దీవెనలు అందించారు.
