కటక్: అల్టిమేట్ ఖో-ఖో సీజన్-2లో తెలుగు యోధాస్ జట్టు 2023 ఏడాదిని విజయంతో ముగించింది. ఆదివారం కటక్లో జరిగిన తమ ఐదో మ్యాచ్లో యోధాస్ ఒక్క పాయింట్ తేడాతో గెలిచింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ఆట ఆఖరి నిమిషంలో కీలక పాయింట్ సాధించిన యోధాస్ 29-28తో ఒడిశా జగర్నాట్స్పై విజయం సాధించింది. యోధాస్ కెప్టెన్ ప్రతీక్ 10 పాయింట్లతో, జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు.