Tuesday, January 21, 2025
spot_img
HomeTELANGANAసచివాలయానికి సీఎం కేసీఆర్.. 

సచివాలయానికి సీఎం కేసీఆర్.. 

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ నూతన సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం ముందు మీడియాకు అభివాదం చేస్తూ సీఎం లోపలికి వెళ్లారు. ఈ సందర్భంగా సచివాలయ పనులను సీఎం పరిశీలిస్తున్నారు. సీఎంతో పాటు ఆర్ అండ్ బి మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ తాత మధు, సీఎస్ శాంతి కుమారి, సీపీ సీవీ ఆనంద్ ఉన్నారు. మరోవైపు నూతన సచివాలయం ప్రారంభ తేదీలపై కేసీఆర్ దృష్టి సారించారు. త్వరలో తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. నెల రోజుల వ్యవధిలోనే సచివాలయం, అమరవీరుల స్మారక చిహ్నం, ఏప్రిల్ 14న అంబేడ్కర్ విగ్రహం ప్రారంభించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుసార్లు సచివాలయాన్ని విజిట్ చేసిన విషయం తెలిసిందే. పాత సచివాలయాన్ని కూల్చి వేసి దాదాపు రూ. 617 కోట్లతో కనీవినీ ఎరుగని రీతిలో నూతన సచివాలయ నిర్మాణాన్నిచేపట్టారు. అత్యంత ఖరీదైన ఫర్నీచర్, అత్యాధునిక వసతులతో, ఎంతో విలాసవంతంగా కొత్త సచివాలయ భవన నిర్మాణం జరిగింది. సచివాలయం పనులు దాదాపు పూర్తి అయ్యాయి.

అయితే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయాన్ని సంక్రాంతికే ప్రారంభించాలని ముందుగా భావించింది. అయితే అప్పటికి సచివాలయ పనులు ఇంకా పూర్తి కాలేదు. దాంతో పాటు బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాటు, రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడంతో సచివాలయ ప్రారంభోత్సవం మొదటిసారి వాయిదా పడింది. ఆ తరువాత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రారంభించాలని నిర్ణయించారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతలోనే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఎన్నికల కోడ్ కారణంగా రెండో సారి ప్రారంభోత్సవం వాయిదా పడింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments