రెబ్బెన: రెబ్బెన తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వకపోవడం, పిర్యాదు దారులకు సహకాలంలో నివేదిక ఇవ్వకపోవడం, ఇసుక మాఫియాను అరికట్టడంలో నిర్లక్ష్యంతో వ్యవరించడం, ప్రభుత్వ భూముల ఆక్రమణకు ముడుపులు తీసుకొని సహకరించడం, అక్రమ పట్టా పాస్ బుక్కులు ఇవ్వడం, విద్యార్థులకు సహకాలంలో సర్టిఫికెట్స్ ఇవ్వడంలో జాప్యం ఇలా చాలా అక్రమాలు జరుగుతున్నాయి. వివిధ ప్రింట్ మీడియాలో కథనాలు వచ్చిన స్పందన కరువవుతుంది.
ఇంతకు ముందు రెబ్బెన కార్యాలయంలో పనిచేసిన నాయబ్ తహసిల్దార్, ప్రస్తుతం పెంచికలపెట్ మండలంలో ఎమ్మార్వో గా పనిచేస్తున్న పిట్టల సరితా తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చి తప్పు చేసిన అధికారులను కాపాడి, బాధితుడు అయిన దుర్గం శ్రీనివాస్ ని ఇబ్బందులకు గురిచేశారు.
బాధితుడైన దుర్గం శ్రీనివాస్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుండి, పట్టా పాస్ బుక్ ఉండి దుర్గం.సాంబయ్య,అతని కుమారులు సాగుచేసుంటు జీవిస్తున్న లావుని పట్టా (ఇతరులకు పట్టా చేయరాదు) గుదేపల్లి శివారు, సర్వే నెంబర్ 28/ఆ, విస్తీర్ణం 6 ఎక్కరముల నుంచి 3.00 ఎక్కరముల భూమిని ఇతరులకు పిఓటి చట్టానికి వ్యతిరేకంగా పట్టా చేశారు, దీనిపై మీసేవలో డి-పారం పట్టా సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకొనకగా ఇంగ్లీష్ భాషలో “ఆఫ్టర్ సెర్చింగ్ రికార్డ్ రూమ్ ద డి-పామ్ పట్టా సర్టిఫికేట్ సర్వే నెం 28 అన్ ఎక్సటెంట్ 6.00 ఎక్కర్స్ ఆఫ్ గుదేపల్లి” ఇలా అని సర్టిఫికేట్ ఇచ్చారు, కానీ దీనికి అర్థమే లేదు, ఎదో పిచ్చి రాతలు గీసి సర్టిఫికెట్ ఇచ్చారు, ఈ నాయబ్ తహసిల్దార్ కి చదువు వస్తుందో, రాదో అర్థం కావడం లేదు అన్నారు. ఆఫ్టర్ సెర్చింగ్ రికార్డ్ రూమ్ అన్నారు. మరి రికార్డ్ రూమ్ లో వెతికిన తరువాత సర్టిఫికేట్ దొరికిందా ? లేదా ? అని చెప్పాలి కదా! చెప్పలేదు. దొంగ పట్ట చేసి తప్పించుకోవడానికి తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారు, ఒక వేళ సరైన సర్టిఫికెట్ ఇవ్వకపోతే పోలీసులను అశ్రయిస్తానని అన్నారు, ఈ ఒక్క సర్టిఫికేటే కాదు ఆర్టీఐ లో ఏ ఒక్క దరఖాస్తు కు సరైన సమాచారం ఇవ్వలేదు, రెండు సార్లు ఆర్టీఐ కమిషన్ నుండి మెమో కూడా వచ్చింది, ఈ మెమో ని ఎస్.ఆర్ లో రాయకుండా ప్రస్తుతం పెంచికలపెట్ మండలంలో ఎమ్మార్వో గా ఇంఛార్జి ఇచ్చారు, ఇలాంటి తప్పుడు నాయబ్ తహసిల్దార్ కి ఇంచార్జి ఎమ్మార్వో గా ఎలా ఇచ్చారు అని ప్రశ్నించి ఆమెను ఎమ్మార్వో విధుల నుంచి తొలగించి సస్పెండ్ చేయాలని దుర్గం.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇలాంటి దొంగ అధికారికి బెస్ట్ ఉద్యోగిగా అవార్డు ఇవ్వడం సిగ్గుచేటని, ప్రస్తుతం అసిఫాబాద్ లో హాట్ టాపిక్ గా నడుస్తున్న ఆసిఫాబాద్ మాజీ సర్పంచ్ బినామీ కథనంలో ఈ నాయబ్ తహసీల్దార్ పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇంతకు ముందు వివిధ ప్రింట్ మీడియాలో కధనాలు వచ్చిన ఈ నాయబ్ తహసిల్దార్ స్పందించలేదు కావున అసిఫాబాద్ కలెక్టర్ పిర్యాదు చేశానన్నారు.
