ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ మాజీ అధ్యక్షులు మేగి నర్సయ్య, వడ్నాల ఆంజనేయులు ఆదివారం స్థానిక ఎల్లమ్మ ఆలయం వద్ద సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, చెన్ని బాబు,షేక్ గౌస్, పందిర్ల లింగం గౌడ్, మాజీ జెడ్పిటిసి ఏలూరి రాజయ్య, కొమ్మిరి శెట్టి తిరుపతి, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, గుండాడి రాంరెడ్డి, రఫిక్, గంట బుచ్చ గౌడ్ తదితరులు ఉన్నారు.