రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో గ్రామపంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న శివాలయంలో, వేణుగోపాల స్వామి దేవాలయంలో తాళాలు పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నం చేసిన ఆగంతకులు. దేవాలయాల్లో దొంగలు పడ్డారని తెలుసుకున్న ఆలయ సిబ్బంది, అధ్యక్షులు గడ్డం జితేందర్, ఆలయ ఉపాధ్యక్షులు గంట వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, సిరిసిల్ల జిల్లా BRS పార్టీ తోట ఆగయ్య, ఎస్ఐ రమాకాంత్ ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఆలయాల తాళాలు పగలగొట్టి దొంగలు విలువైన వస్తువులు ఎత్తుకు వెళ్లకపోవడంతో ఊపిరి పీల్చుకున్న గ్రామస్థులు ఇక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వాటి పట్ల నిర్లక్ష్యం వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్లూస్ టీమ్ సహాయంతో విచారణ చేస్తున్న పోలీసులు.