రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గోపాల్ నగర్ ట్రాలీ ఆటో స్టాండ్ నుండి గుర్తుతెలియని దొంగ చోరీకి పాల్పడి బుధవారం రాత్రి ట్రాలీ ఆటో తో పారిపోతుండగా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ గాజులపల్లి సమీపంలో గ్రామస్తులు ఆటో ట్రాలీతో పట్టుకొని తాళ్లతో బంధించి దేహాశుద్ధి చేశారు. ట్రాలీ ఆటో యజమాని సిరిసిల్ల గోపాల్ నగర్ కు చెందిన బండారి లక్ష్మణ్ ఎల్లారెడ్డిపేట పోలీసులకు సమాచారము అందించాడు. ఎల్లారెడ్డిపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్ కిషన్ రావు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి తాళ్లతో బంధించిన గుర్తుతెలియని వ్యక్తిని చోరీకి గురైన ట్రాలీ ఆటోను ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కిషన్ రావు తెలిపారు,