Saturday, May 17, 2025
spot_img
HomeTELANGANAKCR సభకు స్వచ్చందంగా గులాబీ సైన్యం తరలిరావాలి: వీణవంక MPP ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి.

KCR సభకు స్వచ్చందంగా గులాబీ సైన్యం తరలిరావాలి: వీణవంక MPP ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి.

తెలంగాణ రాష్ట్ర సాధకుడు అపర భగీరథుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ లో నిర్వహించే కధన బేరి సభను విజయవంతం చేయాలని వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. మంగళవారం కరీంనగర్ లోని ఎస్ ఆర్ ఆర్ మైదానంలో నిర్వహించే కదన భేరి బహిరంగ సభకు వీణవంక మండలం నుండి భారీ ఎత్తున టిఆర్ఎస్ అభిమానులు నాయకులు కార్యకర్తలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు సూచించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా సౌమ్యుడు ప్రశ్నించే గొంతుక ఉన్న విద్యావేత్త రాష్ట్ర మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఇందు కొరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించే ఈ సభను విజయవంతం చేయాలని వారు సూచించారు. ఈ సభ విజయవంతం కొరకు స్వచ్ఛందంగా గులాబీ సైన్యం తరలిరావాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నాయకత్వంలో హుజరాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ తీసుకురావాలని మన సత్తా ఏమిటో చూపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments