వాంకిడి మండల కేంద్రంలో మహా శివరాత్రి మహోత్సవం జాతర సంబురంగా కొనసాగింది. ఈ సందర్భంగా శుక్రవారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఉదయం 9:30 గంటలకు వాంకిడి మండల కేంద్రంలోని శివాలయంలో పరమశివున్ని దర్శనం చేసుకుని,ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులందరికీ అయన మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. భక్తజనులు శివయ్య దర్శనం చేసుకుని జాతర మహోత్సవాన్ని ముగించుకుని తిరిగి వారివారి నివాసాలకు ప్రయణమయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ భగవంతుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకుంటూ నందీశ్వరునికి అభిషేకించామని తెలిపారు. ఆయనతో పాటు ఆసిఫాబాద్ డిఎస్పీ సదయ్య శివున్ని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటి సభ్యులు జిల్లా ఎస్పీని శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాంకిడి సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సాగర్ తదితరులు పాల్గొన్నారు.