కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 120 మైక్రాన్స్ కన్నా తక్కువ మందం ప్లాస్టిక్ కవర్లు వాడకాన్ని నిషేధించినారు. వారి ఆదేశాల మేరకు జమ్మికుంట పట్టణములో సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్లను వాడినట్లయితే 5000 – 50000 రూపాయల వరకు జరిమానా విధించబడునని. జమ్మికుంట పట్టణ కేంద్రంలో చిరు వ్యాపారులు హోల్ సేల్ మరియు రిటైల్ వ్యాపారులు హోటల్లు రెస్టారెంట్ల నిర్వాహకులు 120 మైక్రాన్ ల కంటే తక్కువ ఉన్న కవర్లను వాడరాదని జమ్మికుంట మున్సిపల్ కమీషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించడం ద్వారా అనారోగ్యాల బారిన పడతామని ప్లాస్టిక్ కవర్ లు వాడకుండా క్లాత్ సంచులు వాడాలని పలు సూచనలు చేశారు..