Sunday, March 23, 2025
spot_img
HomeTELANGANAవలస జీవి హఠాత్ మరణం

వలస జీవి హఠాత్ మరణం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల రాజు వయస్సు 45 బహ్రెయిన్ దేశములో గత 10 సంవత్సరాల నుండి డ్రైవర్ ఉద్యోగంతో జీవనం సాగిస్తున్నాడు శుక్రవారం రోజున మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బహ్రెయిన్ దేశంలో తాను నివాసం ఉంటున్న రూమ్ నుండి డ్యూటీకి వెళ్లామని రెడీ అవ్వగా హఠాత్తుగా ఛాతిలో నొప్పి రాగానే మిత్రులకు తెలియజేయగా వారు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడని బహ్రెయిన్ లోనీ మృతుని మిత్రులు ఇండియాలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో వారి కుటుంబ సభ్యులకు తెలియపరిచారు. మృతునికి భార్య జ్యోతి, 13 సంవత్సరాల కూతురు మిల్కీ, 15 సంవత్సరాల వయసు గల కుమారుడు కన్నయ్య ఉన్నారు. నిమ్మల రాజు మృతితో రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments