జమ్మికుంట ప్రజలకు పట్టణ సిఐ వరగంటి రవి, హోలీ మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. హోలీ సందర్భంగా స్థానికులతో మరియు బిర్యానీ పాయింట్ సెంటర్ వారితో మాట్లాడి రాత్రి 10 గంటల వరకు బిర్యాని పాయింట్ మూసివేయాలని మరియు హోలీ రోజున వాహనాలపై ఇద్దరి కంటే ఎక్కువ వెళ్లకూడదని రోడ్లపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలని, వాహనాలపై వెళ్లే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉండాలని ఇబ్బంది కలిగిస్తే నిందితులు ఎంతటి వారైనా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రశాంత వాతావరణంలో వారి వారి ఇంటి వద్ద హోలీ సంబరాలు జరుపుకోవాలని జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి ప్రజలకు సూచించారు.