రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కే.శేఖర్ రెడ్డి తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామంలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.47వేల విలువగల మద్యం స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశామని ఎస్సై ప్రకటనలో పేర్కొన్నారు.