రాజన్న సిరిసిల్ల జిల్లా కరీంనగర్-రాజన్న సిరిసిల్ల-కామారెడ్డి ప్రధాన రహదారి అయిన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని అంబేద్కర్ నగర్, మరియు కిష్టంపల్లి, క్రాసింగ్ కూడలి వద్ద, బస్టాండ్, రిక్వెస్ట్ స్టాపు ఏర్పాటు చేశారు, గత కొద్ది రోజులుగా అంబేద్కర్ నగర్, మరియు కిష్టంపల్లి, క్రాసింగ్, రాచర్ల జూనియర్ కాలేజ్ విద్యార్థులు, ప్రయాణికులు, కిలో మీటర్ మేర వరకు నడిచి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది దీనిని దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ చైతన్య యూత్ సమక్షంలో, కరీంనగర్ 1 మరియు రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి TGSRTC డిపో, మేనేజర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వగానే పర్మిషన్ ఇచ్చారు అని తెలిపారు. ఈ ఓపెనింగ్ కార్యక్రమం అంబేద్కర్ చైతన్య యూత్ ప్రెసిడెంట్ అందె బాబు, మరియు వైస్ ప్రెసిడెంట్ అందె ప్రవీణ్, చేతుల మీదుగా ఓపెనింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాచర్ల గొల్లపల్లి గ్రామ ప్రజలు మరియు ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, అంబేద్కర్ చైతన్య యూత్ సభ్యులు పాల్గొన్నారు

