శ్రీ మార్కండేయ జయంతిని పురస్కరించుకొని ఎల్లారెడ్డిపేట పద్మశాలి సేవా సంఘం వారు శోభాయాత్రను నిర్వహిస్తున్నారు. శ్రీ మార్కండేయ ఫోటోను ఉత్సవ వాహనంలో ఏర్పాటు చేసి పురవీధుల గుండా భక్తి పాటలు, భజన కీర్తనలతో అంగరంగ వైభవంగా శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ శోభాయాత్రలో ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సీనియర్ పాత్రికేయుడు బండారి బాల్ రెడ్డి,సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఎంపీటీసీ లు పందిర్ల నాగరాణి ఎనగందుల అనసూయ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు షేక్ గౌస్, బిజెపి నాయకులు, భక్తులు పాల్గొన్నారు.