మౌంట్మాంగనుయ్ (న్యూజిలాండ్): స్వల్ప స్కోర్ల ఆఖరి టీ20లో 17 పరుగుల (డ/లూ)తో గెలుపొందిన న్యూజిలాండ్..బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల సిరీ్సను 1-1తో డ్రా చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో పర్యాటక జట్టు తొలుత 19.2 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. శాంట్నర్ (4/16) నాలుగు వికెట్లు సాధించాడు. స్వల్ప ఛేదనలో షోరిఫుల్ (2/17), మెహ్దీ హసన్ (2/18) దెబ్బకు 49/5తో న్యూజిలాండ్ ఇక్కట్లలో పడింది. అయితే నీషమ్ (28 నాటౌట్), శాంట్నర్ (18 నాటౌట్) ఆరో వికెట్కు 46 పరుగులు జోడించారు. ఈ దశలో వర్షంతో మ్యాచ్ నిలిచిపోవడంతో..అప్పటికి 14.4 ఓవర్లలో 95/5 స్కోరుతో ఉన్న కివీ్సను విజేతగా ప్రకటించారు. కాగా ఈ రెండుజట్ల మధ్య రెండో టీ20 వర్షంతో రద్దయింది.