రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో ఈరోజు పూసల సంఘంలో గౌరవ అధ్యక్షుడు మరియు అధ్యక్షుడు ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు జెండా ఎగరవేసి జాతీయగీతం ఆలపించారు. అనంతరం స్వతంత్ర సమరయోధుల ఫొటోలకు పూలమాలలు సమర్పించారు. ఒకరికొకరు గణతంత్ర దినోత్సవ వేడుక శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకలలో పూసల సంఘం గౌరవ అధ్యక్షుడు మద్ది వేణి లక్ష్మణ్, అధ్యక్షుడు మద్దివేణి కృష్ణ, ఉపాధ్యక్షులు కోనేటి సతీష్, మద్ది వేణి శ్రీనివాస్, గుడ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మద్దివేణి దేవేందర్, ప్రచార కార్యదర్శి ముద్రకోలా శ్రీనివాస్, ముఖ్య సలహాదారుడు శిర్ల లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు ముద్రకోలా ఆంజనేయులు, బోశెట్టి వేణు, ముద్రకోలా దేవయ్య, గుడ్ల రమేష్, ముద్ర కోలా హన్మాండ్లు, ముద్రకోలా శ్రీనివాసు, మద్ది వేణి సాయికుమార్, మద్దివేణి సతీష్, ముద్రకోలా నారాయణ, మరియు కుల సభ్యులందరూ పాల్గొన్నారు

