సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని ఇల్లంతకుంట ఎస్సై L.రాజు తెలిపారు. బుధవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గంజాయి వైపు విద్యార్థులు, యువత చూడరాదని చెడు వ్యసనాల పట్ల యువత ఆకర్షణకు గురికాకూడదని క్రీడల వైపు, విద్య వైపు దృష్టి మళ్లించాలని ఎస్.ఐ అన్నారు. లోన్ ఆప్ ల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొన్న తమను నేరుగా సంప్రదించాలని సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తామని ఎస్సై పేర్కొన్నారు.