రాజన్న సిరిసిల్ల జిల్లా రంగంపేటలో శ్రీ సీతారామ ఆలయ ప్రతిష్ట కార్యక్రమం, వీర్నపల్లి మండలం బంజారా తండా గ్రామపంచాయతీలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ప్రతిష్టా ప్రజాప్రతినిధులు నాయకులు, కొండూరి గాంధీరావు, రమణారావుల ఆధ్వర్యంలో కన్నుల పండువగా జరిగాయి, బ్రహ్మశ్రీ రాచర్ల రఘురాంశర్మ ఆద్వర్యంలో హోమం, ధ్వజస్థంభం, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ సర్పంచ్ కొండూరి గాంధీరావు, రమణారావుల దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తకోటికి అన్నప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డిఎస్పీ మధన్ లాల్ నాయక్, మాజీ సర్పంచ్ మోతీలాల్ నాయక్, జోగుల సుదర్శన్, హారి లాల్ నాయక్, లచ్చిరాం నాయక్, హాంసారెడ్డి నాయక్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి పేట మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బిజెపి, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు,
