రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని సేవాలాల్ తండా గ్రామంలో గుడి వద్ద ప్రభుత్వ నిధులతో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి హైమాస్ లైట్ వేయించి ప్రారంభించారు. తండా వాసులకు ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తూ తండాను అభివృద్ధి చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, మండల ఉపాధ్యక్షుడు తాడేపు కొమురయ్య, ఆలయ కమిటీ సభ్యులు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రంజాన్ నరేష్, సేవలాల్ తండా గ్రామశాఖ అధ్యక్షులు లకావత్ పెద్ద మున్నా, ఉపాధ్యక్షులు పిట్ల ప్రశాంత్, మిడిదొడ్డి భాను యువత తదితరులు పాల్గొన్నారు